22న ఎస్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌

, ఆసిఫాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల యాజమాన్య కమిటీ(ఎస్‌ఎంసీ)ల ఎన్నికలకు నగారా మోగింది. ఈనెల 22న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే విధివిధానాలను పాఠశాలల హెచ్‌ఎంలకు తెలియజేసింది. దీంతో ఎన్నికల నిర్వహణ పనిలో ఉపాధ్యాయులు నిమగ్నమయ్యారు. కుమురం భీం జిల్లాలో మొత్తం 1242 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక 902, ప్రాథమికోన్నత 177, ఉన్నత పాఠశాలలు 152 ఉన్నాయి. వీటిలో 87,176 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.